దీపికా పదుకొనెకి అసలేం అయ్యింది? అసలు విషయం చెప్పిన ప్రభాస్ నిర్మాత.!

బాలీవుడ్ లో ఉన్నటువంటి బిగ్గెస్ట్ స్టార్ హీరోయిన్ లలో ఎనలేని క్రేజ్ ఉన్న హీరోయిన్ దీపికా పదుకొనె కూడా ఒకరు. అయితే దీపికా ఇప్పుడు పలు భారీ బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో పాటుగా తెలుగులో ఫస్ట్ టైం అందులోని ప్రభాస్ తో సినిమా చేస్తుంది. అయితే ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతున్నందున ఆ రేంజ్ అంచనాలే ఈ చిత్రంపై కూడా ఉన్నాయి. 

అయితే అనూహ్యంగా ఈ సినిమా షూటింగ్ టైం లో దీపికా పదుకొనె ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించి హాస్పిటల్ లో జాయిన్ అవ్వాల్సి వచ్చింది. దీంతో నేషనల్ లెవెల్లో ఈ అంశం పెద్ద చర్చగా మారింది. దీనితో చాలా వరకు అసలు విషయం ఏంటి ఆమెకి ఏమయ్యింది అనేది తెలియలేదు. 

కానీ తాజాగా అయితే ఈ అంశంపై నిర్మాత అశ్వనీదత్ క్లారిటీ రివీల్ చేసినట్టుగా తెలుస్తుంది. నిజానికి దీపికకు బ్లడ్ ప్రెజర్(బీపీ) సమస్యలు ఉన్నాయట అందుకే ఆరోజు ఆమె సొమ్మసిల్లి పడిపోయింది అని వెంటనే హాస్పిటల్ తరలించగా ఆమె మళ్ళీ గంటలో కోలుకుంది అని తెలిపారు. 

అంతే కాకుండా ఇప్పుడు మళ్ళీ తమ ప్రాజెక్ట్ కే షూటింగ్ లో కూడా పాల్గొంటుంది అని అసలు విషయం బయట పెట్టారు. ఇక ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే బాలీవుడ్ సీనియర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.