ఈ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ ని ఆపలేం..రచ్చ రచ్చే

రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌, నీతా అంబానీ దంపతుల కుమార్తె ఇషా అంబానీ త్వరలో వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. పిరామల్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ అజయ్‌ పిరామల్‌ కుమారుడు ఆనంద్‌ను ఈషా పెళ్లి చేసుకోబోతున్నారు. డిసెంబర్ 12న రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఘనంగా ఈ వివాహం జరగనుంది. ఈ మేరకు ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరిగిపోతున్నాయి.

పెళ్లికన్నా ముందుగా జరగనున్న ప్రీ వెడ్డింగ్ సెరెమనీలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి వివిధ రంగాల ప్రముఖులు ఉదయ్‌పూర్‌కు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అంబాని ఆహ్వానం మేరకు ప్రభాస్ సైతం హాజరవుతున్నారు. తెలుగు పరిశ్రమ నుంచి ఆహ్వానం అందుతున్న ఏకైక హీరో ప్రభాస్ అని తెలుస్తోంది. బాహుబలితో ఆయనకు వచ్చిన ఫేమ్ తో ఈ ఆహ్వానం అందింది.

ఇక ఇప్పటికే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్, ఆయన సతీమణి అంజలి టెండుల్కర్, ఇటీవలే పెళ్లి చేసుకుని ఓ ఇంటి వాళ్లయిన ప్రియాంకా చోప్రా-నిక్ జోనస్, టీమిండియా మాజీ కెప్టేన్ మహేంద్ర సింగ్ ధోని సతీమణి సాక్షి ధోని, వారి గారాలపట్టి జివా ధోని తాజాగా ఉదయ్‌పూర్ చేరుకున్నారు.

అళాగే ప్రముఖ బాలీవుడ్ నటి విద్యాబాలన్, ఆమె భర్త, ప్రముఖ నిర్మాత సిద్ధార్థ్ రాయ్ కపూర్, జాన్ అబ్రహం-ప్రియ రుంచాల్, జావేద్ జాఫ్రి సైతం ఈ వేడుకకు హాజరయ్యేందుకు ఉదయ్‌పూర్ చేరుకున్నట్టు బాలీవుడ్ మీడియా వెల్లడించింది. ప్రముఖుల రాకతో ఉదయ్‌పూర్ పరిసరాలు వెలిగిపోతున్నాయి.