ఆ బయోపిక్ లో ‘క్రిష్’ గురించి నెగిటివ్ గా ప్రస్తావన?

బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ తన బయోపిక్‌కు తానే దర్శకత్వం వహిస్తానని ప్రకటించింది. ఈ విషయాన్ని ఆమె ఓ బాలీవుడ్‌ మీడియా ద్వారా వెల్లడించారు.అయితే ఈ సందర్బంగా గత కొద్ది కాలంగా క్రిష్ కు, కంగనా కు మధ్య జరుగుతున్న వివాదం ప్రస్తావన వస్తుందా అనే టాపిక్ మొదలైంది. ఖచ్చితంగా క్రిష్ గురించి ఆమె తీస్తుంది అంటున్నారు బాలీవుడ్ జనం. అదీ కూడా నెగిటివ్ గా తీసే అవకాసం ఉందంటున్నారు. ఆమె మాటల్లోనే అది స్పష్టమైంది.

కంగనా మాట్లాడుతూ..నా జీవితంలో నాకు సాయం చేసినవారి దగ్గర్నుంచి అవమానించినవారి వరకు అందరి గురించి నా బయోపిక్‌లో ప్రస్తావిస్తా. అయితే ఎవ్వరి పేరును బయటపెట్టను. ఎందుకంటే అలాంటివారి నుంచి నన్ను, నా జీవితాన్ని కాపాడుకోవాలి. ’ అని వెల్లడించారు కంగన.

కంగనా మాట్లాడుతూ..‘మొత్తానికి సినీరంగంతో సంబంధం లేని ఓ చిన్న ప్రాంతానికి చెందిన అమ్మాయి బాలీవుడ్‌లో ఎలా అగ్ర కథానాయికగా ఎదిగింది అన్న విషయంపై నా బయోపిక్‌ ఉండబోతోంది. యస్… నా బయోపిక్‌ను నేనే తీయబోతున్నాను. నిజాయతీగా, నా జీవితం ఎలా ఉండేదో.. ఇప్పుడు ఎలా ఉందో ఉన్నది ఉన్నట్లు తెరకెక్కిస్తాను. నన్ను జడ్జ్‌ చేయకుండా, నన్ను నాలా ఏక్సెప్ట్ చేసి ప్రేమించేవారు నా చుట్టూ ఎందరో ఉన్నారు. వారి కోసమైనా సినిమా తీయాలని అనుకుంటున్నాను’

ఆమె కంటిన్యూ చేస్తూ..‘కొన్ని వారాల క్రితం ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ నా జీవితంపై పుస్తకం రాస్తానని అన్నారు. తొలుత నేను కంగారుపడ్డాను. కానీ ఆయన గొప్ప రచయిత. నిజాయతీగా రాస్తారన్న నమ్మకం ఉంది. అందుకే ఒప్పుకున్నాను. కాబట్టి నా బయోపిక్‌కు విజయేంద్ర ప్రసాదే కథ అందిస్తారు.