కీర్తి సురేష్ బాలీవుడ్ చిత్ర వివరాలివే

మల్లు పిల్ల కీర్తి సురేష్ తెలుగులో ‘మహానటి’ సినిమాతో జాతీయ అవార్డును సైతం సొంతం చేసుకుంది. ఇక ప్రేక్షకులకు ఎంత చేరువయ్యిందో చెప్పేదేముంది. ఆమెకు వరుసగా ఇటు తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో అవకాశాలు వరుస కడుతున్నాయి. ఈ క్రమంలో ఆమెకు తాజాగా హిందీ చిత్రసీమలో అడుగు పెట్టే అవకాశం వచ్చింది.

అదేంటంటే, ఇండియన్‌ ఫుట్‌బాల్‌ కోచ్, మేనేజర్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీమ్‌ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మైదాన్‌’. ఆయన 1950 నుంచి 1963 వరకూ ఇండియన్‌ ఫుట్‌బాల్‌ కోచ్‌గా వ్యవహరించారు సయ్యద్‌. ఆయన పాత్రను అజయ్‌ దేవగన్‌ పోషిస్తుండగా, ఆయన భార్యగా కీర్తీ సురేశ్‌ నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘బదాయిహో’ ఫేమ్‌ అమిత్‌ రవీంద్రనాథ్‌ శర్మ దర్శకుడు. బోనీ కపూర్, ఆకాశ్‌ చావ్లా, అరునవ జోయ్‌ గుప్తా నిర్మిస్తున్నారు.