కొన్ని పంచ్లు కొందరు వేస్తేనే బాగుంటుంది. దానికి అందం వస్తుంది. సమకాలీన దేశ రాజకీయాలు, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను జోడిస్తూ, దానికి లైట్గా పెప్పర్ జోడించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే.. అవి పేలుతూనే ఉంటాయి. మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేష్.. ఇలాంటి వాటికి ఎప్పుడూ కేంద్రబిందువు అవుతూనే ఉంటారు.
ప్రత్యేకించి లోకేష్. ఆయన ఎప్పుడూ సోషల్ మీడియాకు ఓ మసాలాను అందిస్తుంటారు. ఇలాంటి సెటైర్లు వేయడంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ దిట్ట. ఆయన ఒక్కరే కాదు- ప్రశాంతంగా కనిపించే వైఎస్ఆర్ సీపీ రాజ్యసభ సభ్యుడు వి విజయసాయి రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు, లోకేష్లను టార్గెట్ చేస్తూ చెణుకులు విసురుతుంటారు.
ఏదో సమయం, సందర్భం లేకుండా కాదు, సమయానుగుణంగా ఆయన తన ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తుంటారు. తాజాగా మరొకటి. ఈ సారి ఆయన టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్తో లోకేష్ను కంపేర్ చేస్తూ వదిలిన ఓ ట్వీట్.. భలే పేలుతోంది.
`తెలంగాణాలో కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసెడెంటు అయినప్పటి నుంచి లోకేష్ కు నిద్రం పట్టడం లేదు. తండ్రి అర్జంటుగా తప్పుకుని పార్టీ సిఎం కుర్చీని గాని పార్టీ బాధ్యతలను గాని తనకప్పగిస్తే బాగుండని కలలు కంటున్నాడు. చంద్రబాబు ఈ విషయంలో కొడుకును కూడా నమ్మడని తెలియదు పాపం చిట్టి నాయుడికి..`అంటూ ట్వీట్ చేశారు. ఇది చూసిన తరువాత `నిజమే కదా!` అనే ఫీలింగ్ అందరిలోనూ కలిగితీరుతుంది. ఎనీ డౌట్స్!
తెలంగాణాలో కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసెడెంటు అయినప్పటి నుంచి లోకేష్ కు నిద్రం పట్టడం లేదు. తండ్రి అర్జంటుగా తప్పుకుని పార్టీ సిఎం కుర్చీని గాని పార్టీ బాధ్యతలను గాని తనకప్పగిస్తే బాగుండని కలలు కంటున్నాడు. చంద్రబాబు ఈ విషయంలో కొడుకును కూడా నమ్మడని తెలియదు పాపం చిట్టి నాయుడికి.
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 12, 2019
