కరోనా పేరు చెబితే వణుకుతున్న వైసీపీ ఎమ్మెల్యే లు – కారణం ఇదే !

YSRCP MLA Bhumana Karunakar Reddy reinfected with coronavirus
YSRCP MLA Bhumana Karunakar Reddy reinfected with coronavirus
YSRCP MLA Bhumana Karunakar Reddy reinfected with coronavirus

చిత్తూరు జిల్లా తిరుపతి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డికి రెండోసారి కరోనా సోకింది. తిరుపతిలోని ఓ ప్రైవేటు ల్యాబ్‌లో బుధవారం నిర్వహించిన పరీక్షలో పాజిటివ్‌గా నిర్ధారణైంది. గురువారం మరోసారి ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేసుకుని తదుపరి వైద్యసేవలు చేయించుకోనున్నారు. ఆగస్టులో ఎమ్మెల్యేకి కరోనా సోకడంతో రుయా ఆస్పత్రిలో చేరారు.. కొద్దిరోజులకు కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జయ్యారు.

YSRCP MLA Bhumana Karunakar Reddy reinfected with coronavirus
YSRCP MLA Bhumana Karunakar Reddy reinfected with coronavirus

భూమనతో పాటూ ఆయన కుమారుడికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది.. ఇద్దర్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. అయితే భూమనకు మళ్లీ కరోనా సోకవడం కలకలంరేపింది. రాష్ట్రంలో కరోనా వచ్చిన వ్యక్తికి రెండోసారి వైరస్ సోకలేదు. అలాంటి కేసులు ఎక్కడా నమోదు కాలేదు.. కానీ ఎమ్మెల్యేకు రెండోసారి కరోనా రావడం ఆందోళన కలిగిస్తోంది.