నూజివీడులో టెన్షన్… పోలీసులకు ముచ్చెమటలు (వీడియో)

నూజివీడు వైసిపి ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్ ఆప్పారావు సిసి రోడ్లు ప్రారంభోత్సవాన్ని పట్టణ తెలుగు దేశం నాయకులు అడ్డుకున్నారు. సుమారు గంట సేపు వైసిపి, టిడిపి కార్యకర్తుల మధ్య వాగ్వివాదం సాగింది. వైసెపి. తెలుగు దేశం నాయకులు మధ్య చాల సేపు తోపులాట జరిగింది. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేశారు. నూజివీడు సిఐ రామ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు మెహరించారు. తెలుగు దేశం పట్టణ కార్యదర్శి మెచర్ల కృష్ణ ప్రసాద్ నాయకత్వంలో కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ హైడ్రామ నడుమ పోలీసుల సహకారంతో పట్టణంలో నెహ్రూ పేటలో నూజివీడు ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్ ఆప్పారావు సిసి రోడ్లు ప్రారంబించారు. . మునిపల్ డిఇ అనుమతితో ఎమ్మెల్యే సిసి రోడ్లు ప్రారంభోత్సవం జరిగింది. అయితే,ఈ రోడ్లు ప్రారంభోత్సవానికి అనుమతులు లేవని తెలుగు దేశం నాయకులు ఆరోపణ చేశారు. మొత్తానికి సిసి రోడ్లు ప్రారంభోత్సవం పోలీసులకు ముచ్చమట్టలు పట్టించింది.