వైఎస్ వివేకానందరెడ్డికి రెండో వివాహమా.?

మాజీ మంత్రి, మాజీ ఎంపీ దివంగత వైఎస్ వివేకానందరెడ్డికి రెండో పెళ్ళి అయ్యిందట. మొదటి భార్యకి దూరంగా, రెండో భార్యతో వైఎస్ వివేకానందరెడ్డి వుంటున్నారట. ఈ కారణంగా మొదటి భార్య కుమార్తె సునీతా రెడ్డితో, వైఎస్ వివేకానందరెడ్డికి గొడవలు వచ్చాయట. ఆస్తి పాస్తుల విషయంలో గొడవలు ముదిరి హత్యకు కారణమయ్యాయట.!

అలాగని అనుమానాలు వ్యక్తం చేస్తూ, సాక్షాత్తూ వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, న్యాయస్థానాన్ని ఆశ్రయించడం సంచలనంగా మారింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య విషయంలో ఇది ఓ చీకటి కోణం. కడప జిల్లాలో ఈ విషయం అందరికీ తెలుసట. పులివెందులలో ఏ సందులో అడిగినా ఈ విషయం చెబుతారట.

2010లోనే వైఎస్ వివేకానందరెడ్డికి రెండో పెళ్ళి జరిగిందన్నది తాజాగా వెలుగులోకి వస్తున్న ప్రచారం. అసలు వైఎస్ అవినాష్ రెడ్డి ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు.? అంటే, వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి మీదనే అనుమానాలు వస్తున్నాయి గనుక. ఈ క్రమంలో తనకేమీ సంబంధం లేదని నిరూపించుకునేందుకు అవినాష్ రెడ్డి వ్యూహాత్మక ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. రెండో భార్య కొడుక్కి ఆస్తిపాస్తులు రాసిచ్చేయడానికి వివేకానందరెడ్డి సిద్ధపడిన దరిమిలా, కుటుంబంలో గలాటా జరిగిందన్నది అవినాష్ రెడ్డి, న్యాయస్థానానికి తెలిపిన కీలకమైన అంశం.

2010 లోనే వివేకానందరెడ్డికి పెళ్ళయితే, ఆ విషయం ఇప్పటిదాకా ఎందుకు బయటపడలేదబ్బా.? ఇంతకీ, ఈ ఆరోపణలపై వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఎలా స్పందిస్తారో ఏమో.!