టిడిపి ఎమ్మెల్యే ఇసుక దొంగతనం మీద చర్చకు రెడీ: వైసిపి

పెనుగొండ తెలుగుదేశం ఎమ్యెల్యే పార్థసారథి చేస్తున్న ఇసుక దొంగతనం మీద బహిరంగ చర్చకు సిద్ధమని  అనంతపురం జిల్లా వైసిపి ప్రతిసవాల్ విసిరింది.

పార్థ సారధి ఇసుక వ్యాపారం జిల్లాలో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.  దీనిమీద  పెనుగొండ వైసిపి ఆయనను ఇసుకదొంగ అని వర్ణంచింది. దీనిని ఖండిస్తూ తను అల్లుడితో కలసి చేస్తున్న ఇసుక దొంగరవాణా మీద రుజులువు చూపించాలని ఎ మ్మెల్యే పార్థ సారధి విలేకరుల సమావేశం పెట్టి సవాల్ విసిరారు. రుజువు చేస్తే రాజకీయ సన్యాసం అన్నారు.  

ఈ సవాల్ కు సిద్ధమని ఆరోపణ చేసిన వైసిపి నేత  శంకర్నారాయణ  పేర్కొన్నారు.  ‘‘ నీ సవాల్ కూ నేను సిధ్ధం.ఎక్కడికి రమ్మంటావ్ ? అయ్యా, పార్థసారథీ,   నీవు పెనుగొండలో చేసిన అభివృధ్ధి ఏమీ లేదు. చేసిందంతా ఇసుకను అక్రమంగ తరలించడమే. మా దగ్గిర  రుజువులు ఉన్నాయి. నిజనిరూపణకు కాణిపాకం వరకు అవసరం లేదు. నీ ఉరు… అదే మరువపల్లిలో మీడియా సాక్షిగ రుజువులు చేయడానికి నేను సిధ్ధం. మరి నువ్వు సిధ్ధమా ? సవాల్ విసిరింది ముందు నువ్వే కాబట్టి నీవే ప్లేసు టైం డేట్ చెప్పు. నేను వస్తా..నీ టిఏడిఎ బిల్ ఇస్తా..మీడియా ముందు ఇద్దరం నిలబడదాం..,ఐతే అంతకంటే ముందు పోలీసుల నుండి అనుమతి తీసుకో, ఇట్లు పెనుకొండ వైసిపి నేత శంకర్నారాయణ, అని శంకర నారాయణ వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపారు.