టివి-5 కి షాకిచ్చిన వైసిపి

అధికార టిడిపి కి అనుకూలంగా వార్తలు ప్రసారం చేస్తున్నందున టివి-5 ఛానల్ ను బహిష్కరిస్తున్నట్టు వైసిపి ప్రకటించింది. టివి-5 చానల్ లో జరిగే ఏ కార్యక్రమంలో కూడా వైసిపి నేతలు పాల్గొనవద్దని ఆదేశాలు జారీ చేసింది. పార్టీ ప్రెస్ మీట్లు, కార్యక్రమాల కవరేజిలో కూడా ఆ చానల్ ను నిషేదిస్తున్నామని తెలిపింది.

స్వతంత్ర జర్నలిజం ముసుగులో ఎల్లోమీడియాగా మారిన ఛానళ్లను బట్టబయలు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం ఈరోజు ఓ ప్రకటనను విడుదల చేసింది. వైసీపీ ఇప్పటికే ఆంధ్రజ్యోతి ఛానల్, పత్రికపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.