వైసిపి శుభారంభం..78 అసెంబ్లీల్లో ముందంజ

పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో వైసిపికి ఆధిక్యత మొదలైంది. ఓట్ల లెక్కింపులో ముందుగా అధికారులు పోస్టల్ బ్యాలెట్లతో కౌంటింగ్ ప్రక్రియ మొదలైన విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో సుమారు 4 లక్షల మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో ఉన్నారు. వీరిలో అందరికీ పోస్టల్ బ్యాలెట్లు రాలేదనుకోండి అది వేరే సంగతి. ఏదేమైనా 3.5 లక్షల మంది ఉద్యోగులు తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు.

పోస్టల్ ఓట్ల ప్రాధాన్యత తెలిసిన కారణంగానే ప్రధాన పార్టీల అభ్యర్ధులు ఇద్దరు పోస్టల్ బ్యాలెట్ల వెంట పడ్డారు. దాంతో పోస్టల్ ఓట్లకు గిరికి పెరిగిపోయింది. అందుకనే పార్టీల అభ్యర్ధులు చివరకు ఉద్యోగులకు భారీ డబ్బులు పంపిణీ చేశారు. కొన్ని చోట్ల పోస్టల్ ఓట్లకు రెండు పార్టీల అభ్యర్ధులు రూ 2 వేలు కూడా ఇచ్చుకున్నారు.

అదే సమయంలో డబ్బులు తీసుకున్నా చాలా మంది ఉద్యోగులు వైసిపికే ఓట్లేశారని సమాచారం. ఆ అంచనానే ఇపుడు నిజమవుతోంది. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల ప్రకారం వైసిపి సుమారు 27 నియోజకవర్గాల్లో ఆధిక్యతలో ఉందని సమాచారం. ఇదే విధమైన ఒరవడి కొనసాగుతుందని వైసిపి నేతలు అంచనాలు వేసుకుంటున్నారు.