విషాదం.. ఇద్దరు కుమార్తెలతో వివాహిత ఆత్మహత్య

విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో దారుణం చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మెట్ట జనార్దనరావుకు.. అక్క కూతురు అనూషతో ఆరేళ్ల క్రితం వివాహమైంది. అతను ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆ దంపతులకు సుదీక్ష (5), ఏడాదిన్నర పాప గీతాన్విత ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జనార్దనరావు పని నిమిత్తం శనివారం స్వగ్రామం మెట్టపేటకు వెళ్లాడు. సోమవారం అతను తిరిగి వచ్చేసరికి.. అనూష ఇంట్లో ఫ్యాన్‌కి ఊరి వెసుకుని కనిపించిగా… కుమార్తెలిద్దరూ విగిత జీవులుగా పడి ఉన్నారు. జనార్దనరావు సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు పమోదుచేసేకుని దర్యాప్తు జరుపుతున్నారు.