పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసి పోలింగ్ బూత్ లోనే మహిళ మృతి

తెలంగాణలో జరుగుతున్న మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో అపశృతి జరిగింది. ఓటు వేసేందుకు వచ్చిన మహిళ ప్రాణాలు కోల్పోయింది. పోలింగ్ కేంద్రంలో ఈ ఘటన జరగడంతో అంతా నిశ్చేశ్చులయ్యారు.

వికారాబాద్ జిల్లా పరిగి మండలం మిట్టకోడూరు పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు మహిళ వచ్చింది. ఆమె ఓటు వేసి బయటకు వచ్చే క్రమంలో ఆమెకు ఛాతీ నొప్పి వచ్చి ఆమె కుప్ప కూలిపోయింది. ఈ హఠాత్పరిణామంతో అంతా షాకయ్యరు. ఆమె వెంట ఉన్న కుటుంబ సభ్యులు ఆమెకు వెంటనే సపర్యలు చేసినా ఆమె అప్పటికే ప్రాణాలు విడిచింది. దీంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. పోలింగ్ కు ఎటువంటి అంతరాయం కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. దీంతో పోలింగ్ కొనసాగుతోంది.