మాట మార్చిన రజనీకాంత్

క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన రజనీకాంత్  ఇంకా సినిమాల  మధ్యనే  తిరుగుతున్నాడు . వచ్చే సంవత్సరం ఎన్నికల్లో పోటీ చేయ వచ్చునని ఊహాగానాలు వెలువడుతున్న రజని నుంచి రాజకీయాల గురించి సరైన సమాధానం రాలేదు . తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో రజని కాంత్  రాజకీయాలపై చేసిన కామెంట్స్ , ఆ తరువాత వాటిపై మాట మార్చిన తీరు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి .

భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మిగతా పార్టీలన్నీ కలసి కూటమిగా ఏర్పాటవుతున్నాయి . దీని మీద మీ అభిప్రాయం ఏమిటి ? అని  జర్నలిస్టులు అడిగినప్పుడు  “అది తప్పకుండా ప్రమాదమే” అని చెప్పాడు . అయితే ఆ తరువాత దానిపై మాట్లాడుతూ .”నేనింకా  పూర్తి రాజకీయాల్లోకి రాలేదు .  భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పడితే … అది ఆ పార్టీకి ప్రమాదమే అని నేను అనలేదు . ఒకవేళ అలాంటిది జరిగితే దాని పరిణామం ఎలావుంటుందో ప్రజలే నిర్ణయిస్తారు ” అని చెప్పాడు . రజనీకాంత్ ఎందుకు మాట మార్చినట్టు ?