పార్లమెంట్ లో చంద్రబాబు కి బిగ్ షాక్ ఇవ్వనున్న విజయసాయి !

Vijayasai will give a big shock to Chandrababu in Parliament

గత కొంతకాలంగా ఏపీ లోని ఆలయాల్లో విగ్రహాల పై దాడుల సంఘటనలు విపరీతంగా జరగటం పెను సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పార్టీలన్నీ ఒకరి మీద మరొకరు విమర్శలు చేసుకుంటూ రాజకీయ లబ్ది కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల సంతబొమ్మాళి నంది విగ్రహం ను టీడీపీ నేతలు తీసుకెళ్తున్నారు అంటూ వైసీపీ నేతలు వరుస విమర్శలు చేశారు. అయితే ఈ మేరకు వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి మరోమారు తెలుగు దేశం పార్టీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Vijayasai will give a big shock to Chandrababu in Parliament
Vijayasai will give a big shock to Chandrababu in Parliament

తాజాగా తాడేపల్లి లోని సీఎం కార్యాలయం లో ఎంపీ లతో జరిగిన సమావేశంలో త్వరలో జరగనున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో జరగాల్సిన చర్చలపై సీఎం జగన్ దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశం అనంతరం విజయసాయి రెడ్డి మాట్లాడుతూ… టీడీపీ పై ఆరోపణలు చేశారు. దేవుడి విగ్రహాల ధ్వంసం లో చంద్రబాబు నాయుడు ప్రమేయం ఉందని, ఆలయాల పై టీడీపీ దాడుల ఘటన పై ప్రభుత్వం వద్ద ఆధారాలు ఉన్నాయి అని పేర్కొన్నారు. ఆలయాలపై తెలుగు దేశం పార్టీ దాడులను పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్తామని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.