వంగవీటి ఇంట పెళ్లిసందడి… త్వరలో రాధా వివాహం!

కాపు ఉద్యమ నేత వంగవీటి మోహన రంగా కుమారుడు.. ఏపీ రాజకీయాల్లో మరి ముఖ్యంగా విజయవాడ రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న వంగవీటి రాధాకృష్ణ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారనే విషయంపై ఆయన అభిమానుల్లో చర్చ నడుస్తుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సమయం రానే వచ్చిందని తెలుస్తోంది. త్వరలోనే వంగవీటి రాధా పెళ్ళి చేసుకోనున్నారని సమాచారం.

అవును… వంగవీటి రాధా కృష్ణ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్నారు. ఆయనకు త్వరలోనే నిశ్చితార్థం జరగనుంది. ప్రస్తుతం ఒక వార్త వంగవీటి అభిమానుల్లో ఆనందాన్ని కలిగిస్తోంది. వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధా త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నారని అంటున్నారు. పెళ్లికి ముందు నిశ్చితార్థం వేడుక త్వరలోనే జరగనుందట.. ఆ తరువాత పెళ్లి కూడా జరుగనుంది. అంటే… వచ్చే ఎన్నికలలోపే రాధా ఒకింటివారు కానున్నారన్నమాట.

నర్సాపురం పట్టణానికి చెందిన యువతితో రాధాకృష్ణకు వివాహం నిశ్చయమైందని తెలుస్తోంది. తన మిత్రుడికి దగ్గర బంధువుల అమ్మాయితో ఈ వివాహం నిశ్చయం అయినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త వంగవీటి అభిమానుల్లో ఆనందాన్ని కలిగిస్తోంది. నర్సాపురానికి చెందిన జక్కం పుష్పవల్లితో రాధాకృష్ణకు వివాహం నిశ్చయమైందని తెలుస్తోంది.

ఏలూరు మాజీ మున్సిపల్ ఛైర్‌ పర్సన్‌ జక్కం ఆమ్మాని – బాబ్జీల చిన్న కుమార్తె ఈ జక్కం పుష్పవల్లీ. ఆమెతోనే వంగవీటి రాధాకు వివాహం జరగబోతుందని తెలుస్తోంది. ఈ క్రమంలో… ఈ నెల 19న నర్సాపురంలో ఎంగేజ్మెంట్.. సెప్టెంబర్ 6న వివాహం ముహూర్తం ఖరారు చేశారని తెలుస్తోంది.

కాగా వంగవీటి రాధా 2004లో ఎమ్మెల్యేగా ఎన్నికయిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి ఆయన యాక్టివ్‌ పాలిటిక్స్‌ లో ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన టీడీపీలో ఉన్నారు. విజయవాడ సెంట్రల్ నుంచి పోటీకి దిగాలని ఆలోచిస్తున్నారు.