తెలంగాణలో ఆదివారం నుంచి మరో రెండు జిల్లాలు అందుబాటులోకి రానున్నాయి. నారాయణపేట, ములుగు జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. నారాయణపేట, ములుగు జిల్లాల ఏర్పాటుకు ఇవాళ రెవెన్యూ శాఖ తుది నోటిఫికేషన్ ఇవ్వనుంది. దీంతో రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 33 కు చేరనుంది.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినం(ఈ నెల 17) అయిన ఆదివారం నుంచి కొత్త జిల్లాలు అధికారికంగా ఏర్పాటు కానున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటును సీఎం జన్మదిన కానుకగా టీఆర్ఎస్ చెప్పుకుంటోంది. శనివారం సాయంత్రమే రెండు కొత్త జిల్లాలకు ఎస్పీలను మరియు కలెక్టర్లను నియమించనున్నారు.
