Pawan Kalyan: పవన్ ఫిట్‌నెస్‌పై ట్రోలింగ్.. అవసరమా?

Pawan Kalyan: ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో పవన్ కళ్యాణ్ కుటుంబసమేతంగా పాల్గొని పుణ్యస్నానం చేసిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పవన్ సతీమణి అన్నా లెజినోవా, తన కుమారుడు అకీరా నందన్, దర్శకుడు త్రివిక్రమ్ కూడా ఈ పవిత్ర కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యారు. త్రివేణి సంగమం వద్ద హారతులు ఇచ్చిన పవన్ కళ్యాణ్, ఆ తరుణంలో చొక్కా లేకుండా కనిపించడంతో ఆయన ఫిట్‌నెస్‌పై తీవ్రంగా చర్చ మొదలైంది.

ఆయన శరీరాకృతి చూసి కొందరు సెటైర్లు వేస్తుంటే, మరికొందరు ఇది అవసరమా? అంటూ కౌంటర్ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ కేవలం సినీ నటుడు కాదు, ఒక రాజకీయ నాయకుడు. ప్రజాసేవ, రాజకీయ ఒత్తిడిలో ఉండే వ్యక్తి గురించి బాడీ షేమింగ్ చేయడం అనైతికమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సరిగా నిద్ర లేకుండా, తగినంత వ్యాయామానికి సమయం దొరకకుండా తన సేవా కార్యక్రమాల్లో మునిగిపోయిన పవన్ విషయంలో ఇలా వ్యాఖ్యలు చేయడం తగదని ఫ్యాన్స్ అంటున్నారు.

ప్రముఖుల ఫిట్‌నెస్‌ను ట్రోలింగ్ చేయడం కొత్తేమీ కాదు. కానీ, ఇది వ్యక్తిగతమైన విషయం అని గుర్తుంచుకోవాలి. పవన్ రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా, శక్తిమేరకు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంటారని అభిమానులు చెబుతున్నారు. ప్రజా జీవితంలో ఎంతో కాలం గడిపిన వ్యక్తిని ఇలా బాడీ షేమింగ్ చేయడం సరైనది కాదని అంటున్నారు.

ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది. కానీ పవన్ మాత్రం విమర్శలపై ఎప్పుడు కూడా పెద్దగా స్పందించరని తెలిసిందే. ఇక కుంభమేళా గురించి మాట్లాడుతూ, ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనమని ప్రశంసించారు. కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానం ఆచరిస్తూ ఈ పవిత్ర క్షణాలను అనుభవించారని, ఇలాంటి ఘట్టం మరొకటి ఉండదని పవన్ కళ్యాణ్ తెలిపారు.

వంశీని ఇరికించారు || YS Jagan Press Meet After Meeting Vallabhaneni Vamsi || Telugu Rajyam