పెద్దపల్లి జిల్లాలో సర్పంచ్ అభ్యర్ధి ఓటుకే ఎసరు, గ్రామంలో ఉద్రిక్తత

పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం సోమనపల్లిలో సర్పంచ్ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ నిలిచిపోయాయి. సర్పంచ్ గా పోటి చేస్తున్న ఉప్పునేతల ఎల్లయ్య ఓటును గుర్తు తెలియని వ్యక్తి వేశాడు. ఓటు వేసేందుకు ఎల్లయ్య పోలింగ్ బూతుకు వెళ్లగా ఆయన అప్పటికే ఓటు వేసినట్టుగా అధికారులు తెలిపారు. దీంతో షాకైన ఎల్లయ్య తన ఓటుకే ఎసరు వచ్చిందని గ్రహించి తన మద్దతు దారులకు తెలిపారు. 

దీంతో అనుచరులంతా పోలింగ్ బూతుకు తాళం వేసి ఆందోళన నిర్వహిస్తున్నారు. మళ్లీ ఎన్నికలు పెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇలా ఎంత మంది ఓట్లు తారుమారయ్యాయోనని వారంతా ఆందోళనలో ఉన్నారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది.