కాంగ్రెస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి ఘోర అవమానం ఎదురైంది. మంగళవారం తాండూరు మున్సిపల్ సమావేశానికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి హాజరయ్యారు. దీని పై టిఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయకుండా సమావేశానికి ఎలా హాజరవుతారంటూ వారు ప్రశ్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. అసలు విషయం ఏంటంటే…
మంగళవారం ఉదయం తాండూరు మున్సిపల్ సమావేశం జరిగింది. దీనికి ఎక్స్ అఫిషియో హోదాలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హాజరయ్యారు. ఆయన వచ్చిన తర్వాత కౌన్సిలర్లు అంతా కలిసి ఆయనకు సన్మానం చేశారు. ఇంత వరకు బానే ఉంది. కౌన్సిలర్ల సన్మాన కార్యక్రమం అయిపోయిన తర్వాత టిఆర్ఎస్ కౌన్సిలర్లు రోహిత్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాతనే సమావేశానికి హాజరు కావాలంటూ నిరసన వ్యక్తం చేశారు. సభ నుంచి వారు వాకౌట్ చేశారు.
టిఆర్ఎస్ సభ్యుల ఆందోళనతో సహనం కోల్పోయిన రోహిత్ రెడ్డి నోరు జారారు. ఏ పిచ్చి నా కొడుకులు చెప్పారంటూ దురుసుగా మాట్లాడారు. మున్సిపల్ కమిషనర్ పై కూడా రోహిత్ సీరియస్ అయ్యారు. సమావేశం నుంచి టిఆర్ఎస్ సభ్యులు వెళ్లిపోగా సమావేశం కొనసాగింది. ఎమ్మెల్యే కూడా సమావేశంలోనే ఉన్నారు.
