జగన్ పై ప్రేమ కురిపించిన వైఎస్ షర్మిల.. ఇకనైనా ఆ విమర్శలు ఆగుతాయా?

Yellow media fake news on Sharmila, YS Jagan

గత కొంతకాలంగా జగన్ షర్మిల మధ్య విభేదాలు ఉన్నాయంటూ పదుల సంఖ్యలో కథనాలు ప్రచారంలోకి వచ్చాయనే సంగతి తెలిసిందే. వైరల్ అవుతున్న వార్తలను వైసీపీ నేతలు సైతం నిజమేనని నమ్మారు. అదే సమయంలో షర్మిల సైతం జగన్ తో తనకు విభేదాలు ఉన్నాయనే విధంగా ప్రవర్తించి ప్రజల్లో అనుమానాలు కలిగేలా చేశారు. అయితే తాజాగా అన్నతో విభేదాల గురించి షర్మిల క్లారిటీ ఇచ్చేశారు.

జగన్ తో తనకు ఎలాంటి విభేదాలు లేవని ఆమె కామెంట్లు చేశారు. తనకు అన్నతో గొడవలు లేవు కాబట్టే నేను ఇక్కడ పార్టీ పెట్టానని ఆమె చెప్పుకొచ్చారు. కేసీఆర్ దిక్కుమాలిన పాలన వల్లే నేను ఇక్కడ పార్టీ పెట్టానని ఆమె అన్నారు. కేసీఆర్ పేదలకు బ్రతుకే లేకుండా చేశారని ఆమె వెల్లడించారు. తెలంగాణలో పార్టీ పెట్టడం గురించి క్లారిటీ ఇస్తూ షర్మిల ఈ విషయాలను వెల్లడించడం గమనార్హం.

కేసీఆర్, కేటీఆర్ ఏం త్యాగాలు చేశారని షర్మిల ప్రశ్నించారు. కేసీఆర్ నాటకాలు ఆడారని షర్మిల అన్నారు. కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ ను ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చారని షర్మిల కామెంట్లు చేశారు. షర్మిల వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జగన్, షర్మిల మధ్య ఎలాంటి సమస్యలు లేవని క్లారిటీ రావడంతో ఇకనైనా జగన్ పై విమర్శలు చేసేవాళ్లు సైలెంట్ అవుతారేమో చూడాల్సి ఉంది.

రాబోయే రోజుల్లో షర్మిలకు జగన్ అభిమానుల సపోర్ట్ లభించే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. షర్మిలకు జగన్ పరోక్షంగా సపోర్ట్ చేసినా తెలంగాణలో షర్మిల పార్టీకి ప్లస్ అవుతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. కేసీఆర్ కు జగన్ అంతకంతకూ దూరమవుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో షర్మిలకు జగన్ డైరెక్ట్ గా సపోర్ట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.