మదనపల్లిలో రేవంత్ ప్రచారం షురూ (వీడియో)

కొడంగల్ నియోజకవర్గంలోని మదనపల్లి నుంచి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే నేతలంతా తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారంలో మునగడంతో రేవంత్ కూడా తన ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని గురువారం షురూ చేశారు.

టిఆర్ ఎస్ నాయకులపై రేవంత్ విరుచుకుపడ్డారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఇవాళ టిఆర్ ఎస్ వాళ్లు ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ వాళ్లు మదనపల్లిలో పెడితే టిఆర్ ఎస్ వాళ్లు కూడా అక్కడే పెడుతరట. మనం బ్యానర్లు కడితే వాళ్లు అక్కడ కడుతున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల్లో టిఆర్ ఎస్ పతనం ఖాయమన్నారు. రేవంత్ ప్రచారంలో మాట్లాడిన వీడియో కింద ఉంది చూడండి.

revanth campaign

 

గురువారం ఉదయం నుంచి రేవంత్ రెడ్డి ఇంటి పై ఐటి దాడులు జరుగుతున్నాయి. రేవంత్ కు సంబంధించిన కంపెనీలలో భారీగా డబ్బు మార్పిడి జరిగినట్టు ఐటి అధికారులు గుర్తించారు. రేవంత్ తన ఎన్నికల ప్రచారం ప్రారంభించే రోజే దాడులు జరగడంతో రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. ఐటి దాడులు సాగుతున్నా రేవంత్ తన  ప్రచారాన్ని ఆపలేదు.