తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి పెద్దగా బయటికి రాలేదు. ఇటివల ఆయన తన ఫ్యామిలీతో టూర్ వెళ్లొచ్చారు. తన పనుల నిమిత్తం హైదరాబాద్ కే పరిమితమయ్యారు. అయినా స్థానిక సంస్థలల్లో తన సత్తా చాటాలని రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
కొడంగల్ నియోజకవర్గంలో సర్పంచ్ ఎన్నికలల్లో అధిక స్థానాలు గెలుచుకొని సత్తా చాటాలని రేవంత్ ప్రయత్నిస్తున్నారు. ఆయన మీడియా ముందుకు రాకున్నా కూడా లోపల తన ప్లాన్ అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. స్థానిక సంస్థల్లో కొడంగల్ నియోజకవర్గంలో అధిక స్థానాలు గెలవాలని ఆయన పక్కా ప్లాన్ వేస్తున్నట్టు తెలుస్తోంది.
నిన్న మొన్నటి వరకు హైదరాబాద్ కు పరిమితమైన రేవంత్ రెడ్డి ఇప్పుడు కొడంగల్ కు చేరుకున్నారు. తన నివాసంలో ఆయన వ్యూహానికి పదును పెడుతున్నారని నేతల ద్వారా తెలుస్తోంది. రేవంత్ రెడ్డి మంగళవారం ఉదయం కొడంగల్ కు చేరుకున్నారు. మంగళ, బుధ వారాలు కూడా ఆయన కొడంగల్ లోనే ఉండనున్నారని తెలుస్తోంది. రేవంత్ కొడంగల్ కు చేరుకున్న వీడియో కింద ఉంది చూడండి.
