ఆంధ్రా లో ‘రతన్ టాటా’ పుట్టాడు

కృష్ణా జిల్లా మైలవరం పట్టణానికి చెందిన పుష్పలత,రాధాకృష్ణ దంపతులకు జన్మించిన బిడ్డకు ‘ రతన్ టాటా’ గా నామకరణం చేశారు.

విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలోని 265 గ్రామాలకు స్వస్థ కుటుంబం పధకం ద్వారా ఎంపి కేశినేని నాని గారి కొరికమేరకు టాటా ట్రస్ట్ వారు ఉచిత వైద్య సౌకర్యం కలిపించారు.

‘ఎంపి నాని  కార్డ్’ ను ఉపయోగించి ఉచిత వైద్య సదుపాయం పొందడం ద్వారా శ్రీమతి పుష్పలత పండంటి బిడ్డకు జన్మనిచ్చారు.

తమకు జరిగిన మేలుకు కృతజ్ఞతగా బిడ్డకు ఎంపి కేశినేని నాని  ద్వారా ‘రతన్ టాటా’ అని నామకరణం చేయించారు రాధాకృష్ణ దంపతులు.