నేను చనిపోతే బ్రాహ్మణి భర్తే కారణం… పోసాని సంచలన వ్యాఖ్యలు!

టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ తనపై పరువు నష్టం దావా వేయడంపై ఏపీ చలనచిత్రాభివృద్ధి సంస్థ ఛైర్మన్ పోసాని కృష్ణ మురళి తాజాగా స్పందించారు. చంద్రబాబు అక్రమాలు బయటపెట్టినందుకే తనపై కక్ష గట్టారంటూ ధ్వజమెత్తారు. తాజాగా ఈ విషయాలపై స్పందించిన పోసాని.. తన హత్యకు కుట్ర పన్నుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు!

అవును… తనపై కక్ష కట్టారని, తనను కోర్టు చుట్టూ తిప్పాలని, ఆ సమయంలో తనను హత్య చేయాలని భావిస్తున్నారని పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ ఫోటోలు బయటపెట్టినందుకే తనపై కక్ష కట్టారని ఆయన ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో నారా లోకేష్ అంటే… బ్రాహ్మణి భర్త అని గుర్తులు చెప్పారు.

పరువు నష్టం దావా కేసులో తనను మంగళగిరికి పిలిపించుకుని, కోర్టు చుట్టూ తిప్పాలనేది నారా లోకేష్ అసలు ఉద్దేశమని మండిపడిన పోసాని… ఆ సమయంలో తనను హత్య చేయడానికి కుట్ర పన్నాడని, దీని కోసం తెరవెనుక ప్రయత్నాలు ఇప్పటికే మొదలయ్యాయని ఆరోపించారు.

నారా లోకేష్ కొంతమంది విదేశీ అమ్మాయిలతో చెట్టాపట్టాలేసుకుని అర్ధనగ్నంగా తిరగడానికి సంబంధించిన ఫొటోలను బయటపెట్టాననే కక్షతో తనపై రగిలిపోతున్నాడని.. ఇందులో భాగంగానే మంగళగిరిలో కోర్టు చుట్టూ తిప్పించే క్రమంలో తనను హత్య చేయడానికి కుట్ర పన్నాడని సంచలన ఆరోపణలు చేశారు.

ఈ సందర్భంగా తాను చనిపోతే అందుకు కారణం నారా లోకేష్ అని నొక్కి చెప్పిన పోసాని కృష్ణమురలి… నారా లోకేష్ అంటే చాలామంది ఉంటారు కాబట్టి ఎవరో అనుకోవద్దని చెబుతూ కొన్ని గుర్తులు చెప్పరు. అందులో భాగంగా… “చంద్రబాబు కొడుకు, భువనేశ్వరి కొడుకు, బ్రాహ్మణి భర్త.. అతనే నా చావుకు కారణమౌతాడు” అని పోసాని తేల్చి చెప్పారు.