పట్టాభి ఆరోపణలు అలా – రిపోర్టు ఇలా!

ప్రస్తుతం ఏపీలో ఇంకా గన్నవరం ఇష్యూనే హాట్ టాపిక్క్ గా నడుస్తుంది. ఇందులో భాగంగా లేటెస్ట్ అప్ డేట్స్ ఇలా ఉన్నాయి! టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి రాం ను పోలీసులు గన్నవరం సబ్‌ జైలు కు తరలించారు. పట్టాభి పై హత్యాయత్నంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిట్ కేసులు నమోదు చేసిన పోలీసులు బుదవారం ఉదయం గన్నవరం కోర్టులో హాజరుపరిచారు. అనంతరం పట్టాభికి సంబంధించిన మెడికల్ రిపోర్టును జడ్జికి సమర్పించారు.

అయితే… ఆ మెడికల్ రిపోర్టు లో టీడీపీ నేతలు, పట్టాభి, ఆయన భార్య చేసిన ఆరోపణలు అవాస్తవాలని తేలింది! అవును… పట్టాభి మెడికల్ రిపోర్టును విజయవాడ ప్రభుత్వాస్పత్రి వైద్యులు సీల్డ్ కవర్‌ లో న్యాయమూర్తికి అందజేశారు. ఆ రిపోర్ట్ లో… పట్టాభి శరీరంపై తీవ్ర గాయాలేమీ లేవని, కేవలం అరచేతిపై వాపు మాత్రమే ఉందని నివేదికలో వైద్యులు పేర్కొన్నారు. ఈ నివేదిక ఆధారంగా పట్టాభికి రిమాండ్ విధిస్తూ.. గన్నవరం సబ్‌ జైలుకు తరలించాలని జడ్జి ఆదేశాలు జారీ చేశారు.

కాగా… తనపై పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారని.. కాళ్లు, చేతులపై కోట్టారని న్యాయమూర్తికి పట్టాభి తెలిపిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో… తన భర్త ముఖంపై ముసుగు వేసి ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు చితకబాదారని ఆరోపించిన సంగతి తెలిసిందే. కానీ… మెడికల్ రిపోర్ట్ లో ఆ ఆరోపణలన్నీ సత్యదూరాలని తేలింది!!