బీజేపీకి షాక్.. వైసిపిలోకి నేదురుమల్లి

నెల్లూరు జిల్లా రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. రాష్ట్రంలో పెద్ద రాజకీయ చరిత్ర కలిగిన… రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధనరెడ్డి తనయుడు… నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. అయితే బిజెపి అధిష్టానం నిన్ననే నేదురుమల్లి రాంకుమార్ రెడ్డికి… బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా పార్టీ పదవి ప్రకటించింది. కానీ ఆయన బీజేపీ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు.

నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి… తూర్పుగోదావరి జిల్లా, పిఠాపురం జరుగుతున్న… ప్రజాసంకల్ప పాదయాత్రలో జగన్ ను కలిశారు. వెంకటగిరి నియోజకవర్గం నుండి వైసిపి టికెట్ ఆశిస్తున్న నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి, జగన్ పాదయాత్ర శిబిరంలో ఉన్న ఫోటో ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది.