ఏపీలో ఆలయాలపై దాడుల వెనుక చంద్రబాబు, లోకేష్ .. వైసీపీ కీలక నేత ఆరోపణలు

What has the YCP done to the BCs during the 18 months of government rule

ఆంధ్రప్రదేశ్ లో హిందూ ఆలయాలపై దాడుల విషయంలో అధికార ప్రతిపక్షాల మధ్య పొలిటికల్ వార్ ఓ రేంజ్ లో సాగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ ఆలయాలపై దాడులు పెరిగిపోయాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే.. వైసీపీ కూడా అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తోంది.

chandrababu and nara lokesh tdp andhra pradesh

తాజాగా వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి సంచలన వాఖ్యలు చేశారు. ఆలయాలపై దాడుల వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ హస్తముందని ఆరోపించారు. త్వరలోనే వాస్తవాలన్నీ బయటకు వస్తాయని పేర్కొన్నారు.

విశాఖపట్నంలో పర్యటిస్తున్న ఆయన.. రామతీర్థం ఆలయంలో శ్రీరాముడు విగ్రహం ధ్వంసంపై ప్రశ్నించగా.., చంద్రబాబు, లోకేష్ కనుసన్నల్లోనే ఇదంతా జరిగిందని ఆరోపించారు. ఆర్ధరాత్రి సమయంలో కొంతమంది టీడీపీ కార్యకర్తలు ఆలయ తాళాలు పగులగొట్టి విగ్రహాన్ని ధ్వంసం చేశారన్నారు. ప్రస్తుతం విచారణ జరుగుతోందని అతి త్వరలోనే నిజాలు బయటపెడతామన్నారు