కాంగ్రెస్ జానారెడ్డికి ఇలా షాక్ ఇచ్చారు (వీడియోలు)

కాంగ్రెస్ నేత జానారెడ్డికి మిర్యాలగూడలో కార్యకర్తల నుంచి నిరసన వ్యక్తమయ్యింది. మిర్యాలగూడ కాంగ్రెస్ టికెట్ ను స్థానిక నాయకులకే కేటాయించాలని డిమాండ్ చేశారు. దామరచర్ల జడ్పీటిసి శంకర్ నాయక్, స్కైలాబ్ నాయక్ ల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా వేరే వారికెలా టికెట్లిస్తారని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.

మిర్యాలగూడలో గిరిజన ఓటు బ్యాంకు బలంగా ఉంది. శంకర్ నాయక్ కు కూడా అన్ని మండలాల్లో ఫాలోయింగ్ ఉంది. దీంతో శంకర్ నాయక్ కే మిర్యాలగూడ టికెట్ కేటాయించాలని వారు ఆందోళన చేశారు. కార్యకర్తలు ఆందోళన నిర్వహించిన వీడియోలు కింద ఉన్నాయి చూడండి.