చంద్రబాబుపై విమర్శలు చేసిన మంత్రి కారుమూరి..!

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో గోదావరి వరదలు ఉదృతంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి వరదలపై అధికారులను అలర్ట్ చేశారు అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. తాజాగా మీడియా సమావేశంలో పాల్గొని వరద బాధితులపై తాము తీసుకుంటున్న జాగ్రత్తల గురించి తెలిపారు.

చంద్రబాబు గురించి మాట్లాడుతూ ఏరియల్ సర్వే విహార యాత్రల చేసే వారని విమర్శలు చేశారు. టీడీపీ కార్యకర్తలు, అభిమానులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని.. ఈనాడు పత్రికలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. చంద్రబాబును జాకీలు పెట్టి ఎల్లో మీడియా లేపుతుందని. ఇక రామోజీ దిగజారి చీప్ గా ప్రవర్తిస్తున్నారని అన్నారు. అంతేకాకుండా చంద్రబాబు పాలనలో వర్షాలు పడలేదు అని.. జగన్ పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు అని.. చంద్రబాబు చేసేవి అన్ని చీప్ పాలిటిక్స్ అంటూ వ్యాఖ్యలు చేశారు.