తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి సీఎం కేసీఆర్ పరామర్శ

మాతృ వియోగంతో బాధపడుతున్న తెలంగాణ అసెంబ్లీ  స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని సీఎం కేసీఆర్ పరామర్శించారు. కేసీఆర్ తో పాటు కవిత మరియు పార్టీ నాయకులు ఉన్నారు. పోచారం తల్లి పాపవ్వ అనారోగ్యంతో మంగళవారం చనిపోగా బుధవారం ఆమె అంత్యక్రియలు జరిగాయి. తల్లి అంత్యక్రియల అనంతరం స్పీకర్ స్వగ్రామం పోచారంలోనే ఉన్నారు. దీంతో కేసీఆర్, కవిత, సీఎస్ ఎస్ కే జోషి, రాజీవ్ శర్మ, స్వామి గౌడ్, ఇతర నేతలు వెళ్లి ఆయనను పరామర్శాంచారు. అనంతరం వారు పాపవ్వకు నివాళులర్పించారు.