తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ ను విడుదల చేసిన జేఎన్టీయూ

తెలంగాణ ఎంసెట్ నోటిఫికేషన్ ను జెఎన్టీయూ విడుదల చేసింది. ఈ నెల 6 నుంచి ఏప్రిల్ 5 వతేది వరకు అప్లికేషన్లను స్వీకరిస్తారు. ఏప్రిల్ 6 నుంచి 9 వరకు దరఖాస్తులను ఎడిట్ చేసే అవకాశం ఉంది. దరఖాస్తు ఫీజును ఎస్సీ, ఎస్టీలకు రూ.400గా ఇతరులకు రూ.800 గా నిర్ణయించారు.

ఏప్రిల్ 20 నుంచి మే 1 వ తేది వరకు హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. మే 3,4,5 తేదిలలో ఇంజనీరింగ్ ఆన్ లైన్ పరీక్షను నిర్వహించనున్నారు. అదే విధంగా మే 8 మరియు 9 తేదిలలో అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలను నిర్వహించనున్నారు. ఇంజనీరింగ్ పరీక్షను ఉదయం, అగ్రికల్చర్ మరియు ఫార్మా పరీక్షలను మధ్యాహ్నం నిర్వహించనున్నట్టుగా తెలుస్తోంది.