వైఎస్ జగన్మహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని హైదరాబాద్ లో ఒక యజ్ఞం జరుగుతూ ఉంది. నిరాటంకంగా జరుగుతున్న ఈ యజ్ఞం తొందర్లో దేశంలోనే ఒక రికార్డు కానుంది. ఈనెల 29 నాటికి ఈ యజ్ఞం ఒక ఏడాది పూర్తి చేసుకుంటుంది.జగన్ ముఖ్యమంత్రి అయి పదవీ బాధ్యతలు స్వీకరించేందుకు దాకా ఈ యజ్ఞం కొనసాగుతుందని ఈ యాగం నిర్వహిస్తున్న డాక్టర్ అరిమండ వరప్రసాద్ రెడ్డి అంటున్నారు. ఈ యాగం పేరు శ్రీ మహారుద్ర సహిత సహస్ర చండీయాగం. యాగం నిర్వహిస్తున్న వేదపండితులు నల్ల పెద్ది శివరామశర్మ, సురేశ్ శర్మ, పాపారావుశాస్త్రి, కుమార్ తదితరులతో కలసి వరద ప్రసాద్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా లో ఉండూరు శిబిరం వద్ద జగన్ ని కలసి యజ్ఞఆశీర్వాదాలు అందించారు. జగన్ రాజకీయ కాంపెయన్ నిర్వఘ్నంగా జరగాలని, ఆయన ముఖ్యమంత్రి కావాలని, అన్యాయాలమీద, అధర్మం మీద ఆయన చేస్తున్న పోరాటానికి దైవబలం చేకూర్చేందుకు తాము ఈ యాగం నిర్వహిస్తామని, దీని ఫలితంగా జగన్ ముఖ్యమంత్రి అవుతారని వరప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ యాగాన్ని గత ఏడాది 29న ప్రారంభించామని ఆయన చెప్పారు.

‘2019ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలి. ఇది ప్రజల ఆకాంక్ష. ఈ ఆకాంక్ష నెరవేరేందుకు దరాబాద్లో యేడాది కాలంగా శ్రీమహారుద్ర సహిత సహస్ర చండీయాగం నిర్వహిస్తున్నాం. అప్పటి నుంచి నిర్విరామంగా, నిరాటంకంగా ఈ యాగం జరుగుతున్నది. ఈ నెల 29 నాటికి యేడాది పూర్తవుతుంది. ఆగస్టు 2 వరకు ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నాం. జగన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టి ప్రమాణ స్వీకారం చేసే వరకు యాగం కొనసాగిస్తాం,’ అనివర ప్రసాద్ రెడ్డి చెప్పారు .
యాగ నిర్వాహిస్తున్న శివరామప్రసాద్వర్మ మాట్లాడుతూ కలియుగంలో చండీ అమ్మవారిని, లక్ష్మీ గణపతిని పూజిస్తే సత్ఫలితాలు త్వరగా వస్తాయి. భగవంతుని ఆశీస్సులు జగన్కు ఎల్లవేళలా ఉండేందుకు ఈ యాగం, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
(బ్యానర్ ఫోటో ,ఫ్లికర్ సౌజన్యం)
