‘నిమ్మగడ్డ’కి హైకోర్టు షాక్ ..ఈ-వాచ్ యాప్ కి బ్రేక్ !

The High Court erred in the orders issued by Nimmagadda Ramesh Kumar

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఎస్‌ఈసీ తయారు చేసిన యాప్‌ నకు ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌ నుంచి సెక్యూరిటీ సర్టిఫికేషన్ వచ్చేంతవరకు, ఈ యాప్‌‌ వినియోగాన్ని నిలిపివేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణను ఈనెల 9వ తేదీకి వాయిదా వేసింది.

High court shocks Nimmagadda Ramesh Kumar 
High court shocks Nimmagadda Ramesh Kumar

కాగా పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఈ- వాచ్‌ పేరుతో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ ఓ యాప్‌ను విడుదల చేశారు. దీని ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపారు. అయితే ప్రైవేటు యాప్ ‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఈ- వాచ్ ‌కు సెక్యూరిటీ సర్టిఫికెట్‌ ఉందా అని ఎస్‌ ఈసీ తరఫు న్యాయవాదిని ప్రశ్నించగా, 5 రోజుల్లో తీసుకువస్తామని సమాధానమిచ్చారు.

ఈ నేపథ్యంలో అప్పటి వరకు ఈ యాప్‌ను ఉపయోగించవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇది ప్రైవేటు యాప్ అని, తమకు నష్టం కలిగించేందుకే ఈ యాప్ తీసుకువచ్చారని వైసీపీ ఆరోపిస్తోంది. ఏపీ ఎస్ఈసీ ఈవాచ్ పేరుతో కొత్త యాప్ తీసుకొచ్చింది. పాత యాప్ స్థానంలో కొత్తగా దీనిని ఉపయోగించాలని నిర్ణయించారు. ఈ యాప్‌ను ఈ నెల3న నిమ్మగడ్డ రమేష్ ఆవిష్కరించారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించే క్రమంలో ప్రత్యేకంగా యాప్‌ తీసుకొస్తున్నట్లు ఎన్నికల కమిషనర్‌ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికలకు సంబంధించి ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార నిమిత్తం ఏర్పాటుచేస్తున్న కాల్‌ సెంటర్‌ని కూడా ప్రారంభించారు. ఈ యాప్‌ను ప్రభుత్వం తప్పుబడుతోంది.