ఒక రాత్రికి వస్తావా అంటూ కోటి రూపాయలు ఆఫర్ చేశారన్న హీరోయిన్

సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వివాదం బయటపడినప్పటి నుంచే రోజో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. రోజుకో నటి తమకు అన్యాయం జరిగిందని తమకు కూడా వేధింపులు జరిగాయని బయటికొస్తున్నారు. తాజాగా సినీ నటి సాక్షి చౌదరి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. సాక్షి చౌదరి ఏమన్నారంటే…

“నాకు ఈ మధ్య  సోషల్ మీడియాలో వేధింపులు ఎక్కువవుతున్నాయి. రాత్రికి వస్తావా.. రేటెంత చెప్పు అని అడుగుతున్నారు. ఒక రాత్రి వస్తే ఏకంగా కోటి రూపాయలు ఇస్తామంటూ కొందరు ఆఫర్లు పెడుతున్నారు. ప్రేక్షకులను ఉత్సాహపరిచేందుకే నా హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పెడుతున్నాను. అలా అని నన్ను చులకనగా చూడొద్దు. నాకు ఆఫర్లు ఇచ్చేవారు మూర్ఖులు. ఇంకోసారి ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే వారి బండారం బయటపెడుతాను” అని సాక్షి చౌదరి అన్నది.

పోటుగాడు, జేమ్స్ బాండ్, సెల్ఫీరాజా వంటి చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు సాక్షి చౌదరి దగ్గరైంది. సినిమాల కంటే సోషల్ మీడియా ద్వారానే సాక్షి పేరు సంపాదించింది. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను అప్ లోడ్ చేస్తూ ప్రేక్షకులను, కుర్రకారును హూషారెక్కించేంది. మళ్లీ తనను అవమానపరిచేలా మాట్లాడితే ఊరుకోనని వారందరి జాతకాలు బయటపెడుతానని సాక్షి చౌదరి హెచ్చరించింది.