తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్

తెలంగాణలోని నిరుద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణలో నెలకొల్పిన 119 గురుకులాలకు పోస్టులను మంజూరు చేస్తూ ఆర్ధిక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. 3689 పోస్టులను ఆర్దిక శాఖ మంజూరు చేసింది.

ఇందులో 1071 టీజీటీ, 833 జేఎల్, 833 పీజీటీ, 119 ప్రిన్సిపాల్, 119 ఫిజికల్ డైరెక్టర్, 119 పీఈటీ, 119 చొప్పున లైబ్రేరియన్, క్రాఫ్ట్, స్టాఫ్ నర్స్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులను  మంజూరు చేసింది.  ఔట్ సోర్సింగ్ విధానంలో మరో 595 పోస్టులను మంజూరు చేసింది.

బీసీ గురుకుల విద్యాలయ సంస్థకు మరో 28 రెగ్యులర్ పోస్టులు, పొరుగుసేవల విధానంలో పది పోస్టులు మంజూరు  చేసింది.  2019-20 విద్యాసంవత్సరం నుంచి నాలుగేళ్లలో ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం  అనుమతించింది. వీటిని ఏక కాలంలో కాకుండా దశల వారీగా నియమించనున్నారు. ఏదేమైనా గురుకులాల్లో కొత్త పోస్టులు మంజూరు చేయడం పట్ల నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.