జగన్ మనసు గెలుచుకున్న దేవినేని అవినాష్.. కుమ్మెసావ్ బెదరూ అంటున్న వైసీపీ క్యాడర్

andhra pradesh govt to bring new act to curb corruption

విజయవాడ రాజకీయంలో తన మార్క్ ను చూపించాలని ఎంపీ కేశినేని నాని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అవకాశం దొరికిన ప్రతిసారి అధికార పార్టీని, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఇష్టమొచ్చినట్టు విమర్శిస్తున్నారు. విజయవాడలో తనకు ఎదురు లేదన్న రీతి వ్యవహరించే వారు. అయితే తాజాగా నానిపై దేవినేని అవినాష్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. విజ‌య‌వాడ‌లో నిర్మాణం పూర్త‌యిన దుర్గ‌గుడి ఫ్లై ఓవ‌ర్ ‌ను టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలోనే పూర్తి చేశామ‌ని, ఇప్పుడు వైఎస్సార్ సీపీ ప్రారంభిస్తోంద‌ని నాని వ్యాఖ్యానించారు.

అంతేకాదు, ఫ్లైవోవ‌ర్ క్రెడిట్ మొత్తం టీడీపీదేన‌ని చెప్పారు. అయితే, ఈయ‌న వ్యాఖ్య‌ల‌పై సీనియ‌ర్లు ఎవ‌రూ కూడా మాట్లాడ‌లేదు. కానీ, ఇప్పుడు వైఎస్సార్ సీపీ యువ నాయ‌కుడు, అదే సామాజిక వ‌ర్గానికి చెందిన దేవినేని అవినాష్ గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు.

దుర్గ గుడి ఫ్లై ఓవర్‌పై కేశినేని నాని మాట్లాడడటం సిగ్గు చేటు అని అవినాష్ నిప్పులు చెరిగారు. అంతేకాదు, అధికారంలో ఉండగా పూర్తి చేయలేకపోయారు.. ఇప్పుడు ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఫ్లై ఓవర్ వద్దకు వెళ్లి హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉండగా బీజేపీ ని విమర్శించి బయటకు వచ్చిన టీడీపీ.. ఇప్పుడు ఏమి నచ్చి వెనకేసుకొస్తున్నారో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. రెండు సంవత్సరాల క్రితం బీజేపీని తిట్టిన మీరు ఈ రోజు ఎలా పొగుడుతున్నారని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు చేసిన దేవినేని అవినాష్ ఇప్పుడు విజయవాడ రాజకీయాల్లో కొత్త రాజకీయాలకు తెర లేపారు. అవినాష్ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలతో అవినాష్ సీఎం జగన్ మోహన్ రెడ్డి మనసు గెలుచుకున్నాడని రాజకీయ వర్గాలు చెప్తున్నారు.