26-07-2021: ఏపీ కరోనా అప్డేట్

corona cases update in ap

ఆంధ్ర ప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో 61,298 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 1540 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 19,55,037కి చేరింది. కరోనా కారణంగా నిన్న 19 మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 13,292 కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న2017మంది కోలుకోగా వారితో కలిపి ఇప్పటి వరకు మొత్తం 19,20,780 మంది కోలుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

corona cases update in ap

ప్రస్తుతం ఏపీలో 20,965 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కాగా ఇప్పటివరకు రాష్ట్రంలో 2,42,53,931 కరోనా నిర్థారణ పరీక్షలు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇక జిల్లాల వారీగా కేసుల విషయానికి వస్తే.. అనంతపూర్-49, చిత్తూరు- 280, ఈస్ట్ గోదావరి- 03, గుంటూరు- 152, కడప- 33, కృష్ణ- 252, కర్నూల్- 21, నెల్లూరు- 210, ప్రకాశం- 176, శ్రీకాకుళం- 59, విశాఖపట్నం- 112, విజయనగరం- 14, వెస్ట్ గోదావరి- 168 చొప్పున కేసులు నమోదయ్యాయి. గత కొన్ని నెలలుగా ఈస్ట్ గోదావరి జిల్లాలో వందల సంఖ్యలో నమోదవుతున్న కేసులు నిన్న అత్యల్పంగా 03కి పడిపోవటం ఆశ్చర్యకరంగా ఉంది.