చాన్నాళ్లకి విజయవాడలో కాంగ్రెస్ పండగ సందడి….

ఆంధ్ర కాంగ్రెస్ ఈ రోజు కళకళ లాడింది. విజయవాడ వీధుల్లో కాంగ్రెస్ కదలిక కనిపించింది. ఇంతవరకు అడదడపా ధర్నాలు, పత్రికా ప్రటకలు విడుచేయడం తప్ప విజయవాడలో ఈ మధ్య కాంగ్రెస్ సంచారం లేదనే చెప్పాలి. ఈ రోజు మళ్లీ విజయవాడనగరంలో , కాంగ్రెస్ కార్యాయలం ఆంధ్ర రత్న భవన్ లో పండగవాతావరణ నెలకొనింది. కాంగ్రెస్ నాయకుల్లో భవిష్యత్తు లో మంచి రోజలున్నాయనే ధీమా స్పష్టం కనిపించింది. కారణం, మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడం.

కాంగ్రెస్ లోపార్టీ తిరిగి చేరాక తొలిసారి  విజయవాడ వస్తున్న మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కూమార్ రెడ్డికి గన్నవరం విమానాశ్రయం ఘన స్వాగతం లభించింది. 

మహిళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ ఆధ్వ ద్వర్యంలో సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు.

కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశంలో పాల్గొనడానికి కిరణ్ కుమార్ రెడ్డి విజయవాడ వచ్చారు.

గన్నవరం నుంచి విజయవాడ ప్రభుత్వ అతిధి గృహానికి  రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ ఉమెన్ చాందీతో కలసి చేరుకున్నారు.

విజయవాడ ప్రభుత్వ అతిధి గృహంలో కిరణ్ కుమార్ రెడ్డి సందడి మొదలయింది.  అనేక మంది నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయననుకలుసుకున్నారు. శాలువలు కప్పి స్వాగతం పలికారు. తర్వాత ప్రభుత్వ అతిధి గృహం నుండి యుత్ కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో భారీ బైక్ ర్యాలీతో  ఆంధ్రరత్న భవన్ కు బయలు దేరారు. దారి పొడగునా కిరణ్ కు స్వాగతం పలుకుతూ భారీ హోర్డింగులు, ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. 

 

చాన్నాళ్ల తర్వాత కాంగ్రెస్ లో కళ కనిపించింది. ఇంతసందడి ఈ మధ్య లేదు. ఘనంగా ఇలా ఎవరికీ స్వాగతం చెప్పే అవకాశం కూడా ఎపి కాంగ్రెస్ కు రాలేదు. ఒక్క మాటలో చెబితే కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం కనిపించింది. 2014 లో కాంగ్రెస్ ఓడిపోయాక, పెద్ద తలకాయలన్నీ వైసిపిలోకి వెళ్లిపోవడమో, మౌనంగా ఉండటమో జరుగుతుూ ఉంది.  ఉండవల్లి , హర్షకుమార్ లాంటివారు ఎటూ కాకుండా ఉన్నారు.  కిల్లీ కృపారాణి, కొొొండ్రు మురళి లాంటి వాళ్లను టిడిపి లాక్కునే ప్రయత్నంచేస్తున్నదనే వార్తలొస్తున్నాయి. ఆనం టిడిపి నుంచి వైసిపిలోకి వెళ్లడదానికి సిద్ధమయ్యారు గాని, కాంగ్రెస్ లోకి రావడం లేదు. గత ఏడాది విజయవాడ సిటి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణుడు తెలుగుదేశం నుండి భద్రతకోసం వైసిపిలో చేరారు. డిఎల్ రవీంద్ర రెడ్డి కూడా పార్టీలో లేనట్లే లెక్క. ఇదీ పరిస్థితి. ఇలాంటపుడు కిరణ రాక పార్టీలో పండగ సందడి తీసుకువచ్చింది.

కిరణ్ వచ్చాక,  ఉమెన్ చాందీ, పిసిపి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి,   అధ్యక్షతన కార్యవర్గ సమావేశం ప్రారంభంమయింది. 

సమావేశం లో పాల్గొన్న ఏపీ కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ ఊమెన్ చాందీ ,మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ,ఇటీవల కర్నూలు నుండి రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరిన బైరెడ్డి రాజశేఖరరెడ్డి ,పల్లంరాజు ,జేడీ శీలం ,కిల్లి కృపారాణి ,కొండ్రు మురళి ,సి రామచంద్రయ్య ,కనుమూరి బాపిరాజు ,పలువురు నేతలు హాజరయ్యారు.  ఈ సందర్భంగా మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు  మీడియాతో మాట్లాడారు.

 

అక్టోబర్ 2 నుంచి ఇంటి ఇంటికి కాంగ్రెస్ పేరు తో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లే కార్యక్రమం శ్రీకారం చుట్టబోతున్నాము ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్ని నేరుగా కలుస్తాం కలుస్తామని ఆయన చెప్పారు.

 కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వం లో కేంద్రంలో అధికారంలోకి రాగానే అంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదాపై తొలి సంతకం  చెయ్యడం జరగుతుందని, ఈ విషయాన్ని  రాహుల్ గాంధీ తరఫున రాష్ట్ర ప్రజలకు తెలియచేస్తామని ఆయన చెప్పారు. 

కాంగ్రెస్ వస్తేనే అంధ్రప్రదేశ్ కి ర న్యాయం జరుగుతుందని ప్రజలు మమ్మల్ని అర్థం చేసుకుంటున్నారని,  ఆగస్టు మూడవ వారంలో రాహుల్ గాంధీ అంధ్రప్రదేశ్ పర్యటన వస్తున్నారని, అపుడు కర్నూలు బహిరంగ సభలో పాల్గొంటారని పల్లంరాజు చెప్పారు.