సిబిఐ లంచం లొల్లి : మధ్యలో షబ్బీర్ అలీ కథేంటి?

సిబిఐ పరువును బజారీ కీడ్చిన లంచం గొడవల్లోకి ఇపుడు కాంగ్రెస్ నేత, ఆ పార్టీ ‘డిప్యూటి చీఫ్ మినిష్టర్ ’ క్యాండిడేట్ షబ్బీర్ అలీ పేరు వచ్చింది.  షబ్బీర్ అలీ కూడా అసాధ్యడే నని మీడియా రాస్తున్నది. ఆయన కూడా  సిబిఐ కార్యాలయానికి వెళ్లి తన పేరు ఎక్కడ ఏ విచారణలో రాకుండా జాగ్రత్త పడినట్లు సిబిఐ  లంచం తో ఉన్నతాధికారులను  గుప్పిట్లో పెట్టకున్న హైదరాబాద్ వ్యాపారి, క్రికెటర్, రియల్టర్, వీలర్ డీలర్ సానా సతీష్ బాబు స్వయంగా వెల్లడించారు.

ఇవిగో వివరాలు:

సానా సతీష్ బాబుకి అన్ని పార్టీల రాజకీయనాయకులతో బలమయిన అనుబంధం ఉంది. వాళ్లెపుడై రాచకార్యం మీద న్యూఢిల్లీ   సిబిఐ ఆఫీసుకు వెళ్లాంటే ఎస్కార్ట్ గా  బాబు వెళ్లేవాడు. ఆయన అలా బోత్సా సత్యానారాయణ తో కూడా కలసి వెళ్లినట్లు ఆయన అంగీకరించారు. ఇపుడు ఆయన నోటి నుంచే మహ్మద్ అలీ షబ్బీర్ పేరు బయటకు వచ్చింది.

సిబిఐ స్పెషల్  డైరెక్టర్ రాకేష్ అస్థానా మీద లంచం తీసుకున్న ఫిర్యాదు చేసేందుకు తాను సిబిఐ కార్యాలయానికి వెళ్లినపుడు షబ్బీర్ అలీ తనతో వచ్చినట్లు సతీష్  బాబు చెప్పాడు. షబ్బీర్ అలీ ఎందుకు వెళ్లినట్లు, ఎందుకు సిబిఐ విచారణకు హాజరయ్యారు. సంజాయిషీ ఇచుకునేందుకా? అయితే, షబ్బీర్ దీనిని ఖండిస్తున్నారు. అదే వేరే విషయం. 

మెయిన్ ఖురేషీ అనే మాంసం ఎగుమతి దారుమీద జరుగుతున్న విచారణలోకి తనపేరు లాగకుండా ఉండేందుకు సిబి ఐ అధికారులు తన నుంచి రు. 2.95 కోట్లు లంచం తీసుకున్నారనేది బాబు ఆరోపణ. దీనిని మీద ఆయన సిబిఐలో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుచేసేందుకు షబ్బీర్ అలీ, జువెల్లర్ సుఖేష్ గుప్తా తీసుకునే ఆయన సిబిఐ కార్యాలయానికి వెళ్లాడు. సతీష్ బాబు ఫిర్యాదు మేరకు ఎఫ్ ఐ ఆర్ కూడా కట్టారు. ‘సిబిఐ నుంచి నోటీసులు అందుకున్నాక, సిబిఐ డిఎస్ పి దేవేందర్ కు మార్ నన్ను విచారించారు. 2011లొ ఖురేషీ కంపెనీలో రు. 50 లక్షలు పెట్టుబడి పెట్టడం గురించి వాకబు చేశారు. పెట్టుబడి పెట్టిన మాట నిజమేనని, అయితే, అది చట్టబద్ధంగా పెట్టిన పెట్టుబడి , ఖురేషీకి చెందిన గ్రేట్ హైట్స్ ఇన్ ఫ్రా లో పెట్టుబడి పెట్టాను. అది చట్టబద్ధంగా చేసిన ఇన్వెస్ట్ మెంట్. ఈ విషయాన్ని నేను టాక్స్ రిటర్న్ లో కూడా పొందుపరిచాను. తర్వాత నవంబర్1,2017న సిబిఐ నన్ను మళ్లీ పిలిచింది.ఆశ్చర్యంగా అపుడు కూడా దేవెందర్  కుమార్ అవే పాత  ప్రశ్నలు వేశారు. ఆ రోజు జెవెల్లర్ సుకేష్ గుప్తా, షబ్బీర్ అలీ కూడా నాతో పాటు సిబిఐ కార్యాలయానికి వచ్చారు. విచారణలో వాళ్లు కూడా అవే సమాధానాలు ఇచ్చారు. వాన్ పిక్ కేసుకోసమే  ఖెరేషీకి ఈ రు.50 లక్షలు ఇచ్చావని దేవేందర్ అన్నారు. నేను కాదు అన్నాను.’

అయితే, దీన్నంతా షబ్బీర్ అలీ ఖండించారు. తనకెపుడూ సిబిఐ నుంచి నోటీసు అందలేదని ఆయన టైమ్సాఫ్ ఇండియా కు చెప్పారు.‘‘నాకు సుఖేష్ గుప్తా తెలుసు.సుఖేష్ కేసు వ్యవహారంలో నేను ఆయనతో కలసి ఖురేషీని కలుసుకునేందుకు వెళ్లాను. దీనికి కారణం ఖురేషీ మాంచి రియల్టర్ కమ్ లాయర్ అనే. ఈ  మేరకునేను ఎపుడో స్టేట్ మెంట్ కూడా ఇచ్చాను. జూబ్లీ హిల్స్ క్లబ్ లో నాకు సతీష్ బాబు పరిచయం.దేవేందర్ తో జరిగిన ఏ డీల్  మీటింగ్ కు నేను వెళ్లలేదు.’ అని షబ్బీర్ అలీ చెబుతున్నారు.

సిబిఐ లో లంచావతారాల గురించి విచారణ మొదలయినందున  ఇక సతీష్  బాబును  సిబిఐ అంత సులభంగా వదలదు. ఈ కేసులో ఉమ్మడి ఆంధ్రాను కుదిపేసిన వాన్ పిక్ పేరు కూడా వచ్చింది. వాన్ పిక్ కేసుతో ఎంత మందికి సబంధం ఉందో తెలుగునాట అందరికి తెలిసిందే.

షబ్బీర్ అలీ మీద సిబిఐ కార్యాలయం కెమెరాలు ఏమిచెబుతాయో చూడాలి. మొత్తానికి సతీష్ బాబు వెర్సస్ రాకేష్ అస్తానా కేసు తెలుగు రాజకీయ నాయకులకు చుట్టుకునేలా ఉంది.

తాలూకాఫీసులో అయిదొందలు పడేసి క్యాస్ట్ సర్టిఫెకెట్ పొందుతున్నట్లు సిబిఐ లో కూడా కోటో రెండో కోట్లో పడేసి న్యాయం కొనుక్కోవచ్చిు, క్లీన్ చిట్స్ తెచ్చుకోవచ్చు. రాజకీయ అండలేకపోతే, సిబిఐ తాటవలుస్తుంది.  అండవుంటే ఏమీ కాదని కాకినాడ సతీష్  బాబు కథ చెబుతుంది.