AMNS Steel Plant: ఏపీ పారిశ్రామిక విప్లవం: ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన..

AMNS Steel Plant: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. రాష్ట్రంలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రాజెక్టుగా నిలవనున్న ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా (AMNS India) ప్లాంట్‌కు (మార్చి 23, సోమవారం) శంకుస్థాపన జరగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులతో కలిసి ఈ భారీ ప్రాజెక్టుకు భూమి పూజ నిర్వహించనున్నారు.

అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఏర్పాటు కానున్న ఈ స్టీల్ ప్లాంట్ విశేషాలు పరిశీలిస్తే.

మొత్తం పెట్టుబడి: రూ. 1,35,964 కోట్లు.

వార్షిక సామర్థ్యం: 17.8 మిలియన్ మెట్రిక్ టన్నులు.

ఉపాధి అవకాశాలు: ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సుమారు 1 లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు.

విస్తీర్ణం: 5,465 ఎకరాల భారీ ప్రాంగణం.

ఈ మెగా ప్రాజెక్టును రెండు విడతల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

మొదటి దశ: ఏడాదికి 7.5 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం.

రెండో దశ: అదనంగా 10.5 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం పెంపు.

స్టీల్ ప్లాంట్‌కు అనుబంధంగా ఎగుమతి, దిగుమతుల సౌకర్యార్థం కాప్టివ్ పోర్టును కూడా ఏర్పాటు చేస్తున్నారు. 316 ఎకరాల్లో రూ. 11,198 కోట్ల అదనపు వ్యయంతో నిర్మించే ఈ పోర్టు ద్వారా మరో 6 వేల మందికి ఉపాధి లభించనుంది. దీని సామర్థ్యం 50 మిలియన్ మెట్రిక్ టన్నులుగా ఉండనుంది.

ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి భారీగా అతిథులు హాజరవుతున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. ఆర్సెలార్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ లక్ష్మీ మిట్టల్, AMNS ఇండియా ఛైర్మన్ ఆదిత్య మిట్టల్.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం హెలికాప్టర్ ద్వారా రాజయ్యపేట చేరుకుంటారు. మధ్యాహ్నం 3:40 గంటలకు ప్లాంట్‌కు సంబంధించిన ‘ఎక్స్‌పీరియన్స్ జోన్’ను సందర్శించి, ప్లాంట్ మోడల్‌ను పరిశీలిస్తారు. అనంతరం కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులతో కలిసి శంకుస్థాపన ఫలకాన్ని ఆవిష్కరిస్తారు.

ఈ ప్లాంట్ ఏర్పాటుతో విశాఖపట్నం ఎకనమిక్ జోన్ దేశంలోనే కీలక పారిశ్రామిక కేంద్రంగా మారనుంది. పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాల కోసం జాతీయ రహదారి (NH-16) నుండి ప్లాంట్ వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నాలుగు వరుసల రహదారిని అభివృద్ధి చేస్తోంది.

గరికపాటి చెప్పింది 100 % కరెక్ట్.. | Dasari Vignan Gives Clarity about Garikapati Controversy