పెళ్లికి నో చెప్పాడని అమెరికా లో ఏపీ యువతి ఆత్మహత్య !

చిత్తూరు పట్టణం పోలీసు కాలనీకి చెందిన సుష్మ కొన్నాళ్లుగా అమెరికాలో చదువుకుంటూ ఉద్యోగం చేస్తోంది. ఆమె వివాహం ఈనెల 3 వ తారీకున జరగాల్సి ఉంది. కాని అబ్బాయి చివరి నిమిషంలో తనకు కాస్త సమయం కావాలంటూ పెళ్లిని వాయిదా వేయించాడు. దాంతో మనస్థాపంతో సుష్మ ఆత్మహత్య చేసుకున్నట్లుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

chittoor woman suicide in usa: అమెరికాలో చిత్తూరు యువతి ఆత్మహత్య.. పెళ్లి  జరగాల్సిన రోజే ఘోరం! - chittoor software engineer commits suicide in usa |  Samayam Telugu

టెక్సాస్‌ లో తాను ఉంటున్న ప్లాట్‌ లోని బాత్‌ రూంలో ఉరి వేసుకుని ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయమై సుష్మ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూతలపట్టు మండలం బందార్లపల్లికి చెందిన మురళి కుమారుడు భరత్‌ టెక్సాస్‌ లో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. అక్కడే ఉండే సుష్మ కు భరత్ కు పెళ్లి ఖరారు చేయడం జరిగింది.

పెళ్లికి అంతా ఓకే అనుకుని ఈ నెల 3వ తారీకున పెళ్లి పెట్టుకున్నారు. కాని భరత్‌ ఉన్నట్లుండి పెళ్లి పై ఆసక్తి లేదు మరి కొన్ని రోజుల పాటు సమయం కావాలంటూ తల్లిదండ్రులకు చెప్పాడట. కొన్ని రోజుల క్రితం ఇద్దరి మద్య విభేదాలు వచ్చాయని అందుకే పెళ్లి వద్దని భరత్‌ చెప్పినట్లుగా తెలుస్తోంది.