సీఆర్డీఏ చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలి

ap high court

ఏపీ రాజధాని అంశంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రైతులు, ఉద్యమ సమితి నేతలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. రాజధాని గ్రామాల్లోని దీక్షా శిబిరాలోని రైతులు, మహిళలు సంబరాలు జరుపుకున్నారు. గ్రామాల్లో రైతులు, మహిళలు పరస్పరం మిఠాయిలు పంచుకుంటున్నారు. తమకు అనుకూలంగా తీర్పునిచ్చినందుకు హైకోర్టు వద్ద పలువురు రైతులు సాష్టాంగ నమస్కారం చేశారు రాజధానిగా అమరావతిని కొనసాగించాలని ప్రభుత్వం కోరారు. సీఆర్డీఏ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని న్యాయస్థానం గురువారం తీర్పును ఇచ్చిన విషయం తెలిసిందే.