ఆ కీలక నేతకు పిలిచి పదవి… ‘బాలయ్య’కి జగన్ ఊహించని షాక్ !

balakrishna telugu rajyam

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి టీడీపీ నేత , హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఊహించని షాక్ ఇచ్చాడు. హిందూపురం లో బాలయ్యకి ఝలక్ ఇచ్చిన మహ్మద్ ఇక్బాల్ కి సీఎం జగన్ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు. ఆయనకు ప్రత్యేకంగా పిలిచి ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేశారు. ఆయన 2019 అసెంబ్లీ ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసి బాలయ్య చేతిలో ఓడిపోయారు.

బాలయ్య టార్గెట్‌గా జగన్ ప్లాన్.. ఆ నేతకు పిలిచి పదవి ఇచ్చిన సీఎం

అయితే, ఆ తర్వాత ఆయనకు జగన్ హిందూపురం బాధ్యతలు అప్పగించారు. ఇటీవల ఏపీలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గంలో బాలయ్యకు షాక్ ఇస్తూ తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటి చోట కూడా వైసీపీ జెండా ఎగరేసింది. హిందూపురంలోని 38 స్థానాల్లో 30 చోట్ల తమదే విజయమని వైసీపీ తెలిపింది. తనకు తిరుగులేదనకున్న హిందూపురంలో ఈ ఫలితాలు బాలయ్యకు షాక్ అనే చెప్పాలి. బాల‌య్య నేరుగా ప్ర‌చారం చేసినా ప్ర‌యోజ‌నం లేక‌పోయింది.

బాలయ్యను కూడా కంగారు పెట్టిన ఇక్బాల్‌కు ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు సీఎం జగన్. తాజాగా ప్రకటించిన ఆరుగురు ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో ఇక్బాల్ కూడా ఒకరు. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో టెన్షన్ పెట్టిన ఓటర్లను మళ్లీ ప్రసన్నం చేసుకోవడానికి బాలయ్య రంగంలోకి దిగారు. ఈసారి హిందూపురం మున్సిపాలిటీలో తమ పట్టు నిలబెట్టుకోవడానికి బాల‌య్య క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌ట‌న‌లు చేసి లోక‌ల్ కేడ‌ర్ తో మంత‌నాలు జ‌రుపుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్ప‌టికే అధికార పార్టీ నేత‌లు ఇక్క‌డ ప్ర‌చారం ఊద‌ర‌గొట్టేస్తోన్నారు. పార్టీ నేత ఇక్భాల్ ఇప్ప‌టికే మున్సిపాలిటీ మొత్తం తిరుగుతూ కేడ‌ర్ లో ఉత్సాహాం నింపుతున్నారు.తాజాగా ఇక్బాల్‌కు ఎమ్మెల్సీగా పదవి ఖరారు చేయడంతో ఆయన మరింత దూకుడుగా వెళ్లనున్నారు.