కేఏ పాల్ పై యాంకర్ శ్వేతా రెడ్డి సంచలన ఆరోపణలు

ఏపీలో అన్ని పార్టీల రాజకీయం ఒకటైతే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ రాజకీయం మరోలా ఉంది. ఇటీవల టివి యాంకర్ శ్వేతారెడ్డి బాలకృష్ణ పై పోటికి దిగుతుందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత  ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేఏ పాల్ దీని పై స్పందించారు. అసలు శ్వేతా రెడ్డికి టికెట్ ఇస్తానని తాను అనలేదని అన్నారు. దీని పై యాంకర్ శ్వేతా రెడ్డి స్పందించారు. ఆమె ఏమన్నారంటే…

“కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ పేరుతో దోచుకుంటున్నాడు. కేఏ పాల్ ఓ కామాంధుడు. అమ్మాయిల పై చేతులేసి తాకరాని చోట తాకుతుంటాడు. అనంతపురం పర్యటనలో నాతో ఓ సారి ఇలాగే బిహేవ్ చేశాడు. అలా బిహేవ్ చేస్తే అప్పుడు నేను గట్టిగా హెచ్చరించాను. అప్పటి నుంచి తన జోలికి రాలేదు. కానీ చాలా మంది మహిళలతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. నాకు హిందూపురం టికెట్ ఇస్తానని హామీనిచ్చాడు. పైసలిస్తేనే టికెట్ ఇస్తానని మెలిక పెట్టాడు. పార్టీ పేరు చెప్పుకొని లక్షల్లో ఫండ్ వసూలు చేస్తున్నాడు. పార్టీ టికెట్లను అమ్ముకుంటున్నాడు.” అని శ్వేతా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

శ్వేతా రెడ్డి ఆరోపణల పై కేఏ పాల్ కూడా అంతే స్థాయిలో స్పందించారు. ఆయన ఏమన్నారంటే…

“శ్వేతకు చాలా మందితో సంబంధాలున్నాయని, ఆమె క్యారెక్టర్ మంచిది కాదని గుర్తించాం. ఈ కారణంగానే ఆమెకు హిందూపురం టికెట్ ఇవ్వవద్దని నిర్ణయించాం. టికెట్ ఇవ్వడం లేదని చెబితే నా పైనే తప్పుడు ఆరోపణలు చేస్తోంది.” అని అన్నారు. 

 

నిన్న మొన్నటి వరకు టివి యాంకర్ బాలకృష్ణ పై పోటి చేయబోతుందని ప్రచారం జరిగింది. అంతలోనే కేఏ పాల్, శ్వేతా రెడ్డి ఒకరి పై ఒకరు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేసుకోవడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది.