ప్రపంచంలో ఎవరు చేయని తప్పు చంద్రబాబు చేశారు: అంబటి రాంబాబు

తాజాగా మంత్రి అంబటి రాంబాబు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు చేసిన తప్పు వల్లే పోలవరం ప్రాజెక్ట్ డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది అని అన్నారు. అంతేకాకుండా లోయర్ కాపర్ డ్యాం మునిగిపోయిందని అన్నారు.

అసలు స్పిల్ వే ఆపేసి డయాఫ్రమ్ వాల్ ఎలా నిర్మించారు అని ప్రశ్నించారు. ఇక ప్రపంచంలో ఎవరు చేయని తప్పును చంద్రబాబు చేశారు అంటూ.. ఆయనను ఎవరు క్షమించరు అని అన్నారు. ఇక జగన్ ప్రభుత్వం వల్ల పోలవరం ఆలస్యమైంది అని తెలుగుదేశం పార్టీ తప్పుడు ప్రచారాలు చేస్తుంది అని అన్నారు. అంతేకాకుండా చంద్రబాబును దృష్టిలో పెట్టుకొని మరి కొన్ని విషయాలు బయటికి లాగుతూ వ్యాఖ్యలు చేశారు అంబటి రాంబాబు.