రోడ్డు ప్రమాదంలో ఎంపీ మృతి

రోడ్డు ప్రమాదంలో ఏఐడిఎంకే ఎంపీ రాజేంద్రన్ దుర్మరణం చెందారు. విల్లుపురం జిల్లా దిండివనమ్ వద్ద ఎంపీ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. దీంతో కారు పల్టీలు పడింది. ఈ ప్రమాదంలో ఎంపీ అక్కడికక్కడే చనిపోగా డ్రైవర్ కు తీవ్రగాయాలయ్యాయి. కారు అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమైనట్టు తెలుస్తోంది.

 రాజేంద్రన్ 2014లో విల్లుపురం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. రాజేంద్రన్ మృతితో ఏఐడిఎంకే దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది.