హాజీపూర్ సైకో కిల్లర్ కు ఉరి ?

ముగ్గురు బాలికలపై దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన హాజీపూర్ సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి కి కోర్టు ఉరి శిక్ష విధించింది. ఈ రోజు ఈ కేసుపై తీర్పిచ్చిన ఫోక్సో కోర్టు శ్రీనివాస్ రెడ్డిని దోషిగా పరిగణిస్తూ ఉరి శిక్ష విధించింది. ఇందులో మూడు కేసుల్లో ప్రాసిక్యూషన్ సాక్ష్యాలను నిరూపించిందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని హాజీపూర్ గ్రామానికి చెందిన సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి .. లిఫ్ట్ పేరుతొ ముగ్గురు మైనర్ బాలికలను బైక్ పై ఎక్కించుకుని తన వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లి అత్యాచారం, హత్య చేసి ఆ తరువాత బావిలో పూడ్చి పెట్టాడు. అలా ఇప్పటి వరకు శ్రావణి, మనీషా, కల్పనా లను చంపినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసుల్లో ఉన్న నిందితుడిని విచారించిన న్యాయస్థానం ఉరిశిక్ష విధిస్తు తీర్ప్యూ వెల్లడైంది. శ్రీనివాస్ రెడ్డికి మరణశిక్ష విధించడంతో బాధిత కుటుంబాలతో పాటు హాజీపూర్ గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.