టీడీపీకి ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ రాజీనామా

Kurnool-MLC-KE-Prabhakar-Joining-YSRCP

రాయలసీమలో టీడీపీకి భారీ దెబ్బలే తగులుతున్నాయి. కడప జిల్లాలో ఇప్పటికే కీలకమైన నేతలంతా ఆ పార్టీని వీడిపోగా ఇప్పుడు కర్నూలులోనూ రాజకీయంగా పేరున్న కేఈ కుటుంబం టీడీపీని వీడి పోయేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ మేరకు ఎమ్మెల్సీ కె ఈ ప్రభాకర్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

టీడీపీ పార్టీకి మనుగడ లేకపోవడం, కనీసం తన వర్గీయులకు తాను అడిగిన కార్పొరేటర్ టికెట్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో టిడిపి పార్టీ ఉండటం వల్లే కేఈ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే 2019 ఎన్నికల ముందు నుండే కేఈ పార్టీ అధినాయకత్వంపై తీవ్ర అసహనంతో ఉన్నారు. ప్రత్యర్థి వర్గం అయిన కోట్ల కుటుంబాన్ని టీడీపీలోకి తీసుకోవడంపై వారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. కానీ కేఈ కృష్ణమూర్తి వారించడంతో కేఈ ప్రభాకర్ పార్టీని వీడకుండా కొనసాగారు. ఇక తాజాగా స్థానిక ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం కేఈ కుటుంబం కోరిన విధంగా సీట్లు ఇవ్వకపోవడంతో ఇక పార్టీలో ఉండటం అనవసరం అని, పార్టీకి మనుగడ కూడా లేదని పేర్కొంది. త్వరలో రాజకీయ భవిష్యత్తు ఏమిటీ, ఏ పార్టీలో చేరబోతున్నారన్నది తెలపనుంది.