విశాఖ ఎయిర్ పోర్ట్ సంఘటనలపై కేంద్రం ఆరా?

మొన్న గురువారం విశాఖ పట్నం ఎయిర్ పోర్ట్ లో చంద్రబాబు నాయుడును అడ్డగించి తిరిగి పంపి వేసిన సంఘటనపై కేంద్ర హోంశాఖ రాష్ట్ర డిజిపిని ఆరా తీసినట్లు తెలిసింది. మాజీ ముఖ్యమంత్రి జాతీయ స్థాయిలో గుర్తింపు వున్న నేత అంశంలో ఏం జరిగిందని వివరాలు సేకరించినట్లు తెలిసింది. అయితే ఇది మామూలుగా వివిఐపి అంశంలో జరిగే తతంగం అని చెబుతున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డిని విశాఖపట్నం నుండి తిరిగి పంపినపుడు కూడా కేంద్ర హోం శాఖ వివరాలు అడిగిందని చెబుతున్నారు.

అయితే జెడ్ ప్లస్ భద్రత గల నేతను జన సమూహం ముందు పెట్టి అన్ని గంటలు గడపడంపై చంద్రబాబు నాయుడు భద్రత సిబ్బంది స్థానిక పోలీసులపై అసంతృప్తి వెలుబుచ్చడం వాస్తవమంటున్నారు. ఒక వేళ జరగరానిది ఏమైనా జరిగితే భద్రత సిబ్బంది టార్గెట్ అవుతారు. కాబట్టి వారు అన్నిటికి సిద్ధమై వుండినారని తెలిసింది. ఏది ఏమైనా శుక్రవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పోలీసులను వేసిన ప్రశ్నలు పరిశీలించితే పోలీసులు అధికారులు టార్గెట్ అయ్యే ప్రమాదం వుందంటున్నారు. ఇంతకీ మార్చి 2 వతేదీ తేలిపోనున్నది. న్యాయమూర్తి మూడ్ చూస్తే తిరిగి చంద్రబాబు నాయుడు పర్యటనకు అనుమతి ఇచ్చేట్టువుందంటున్నారు